దేశంలోనే అతిపెద్ద యాత్రా కేంద్రం తిరుమల...
తిరుమల నేడు భారత దేశంలో అతి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న యాత్రా కేంద్రంగా మారింది. దేశంలోని భక్తుల పర్యాటక మ్యాప్లో శాశ్వతమైన, కీలకమైన కేంద్రంగా తిరుమల రూపొందింది. హిందూ మతంలోని వైఖానస పూజా విధానంలోని ఆగమ సాంప్రదాయాలను తుచ తప్పకుండా ఆచరించడం ద్వారా శ్రీవేంకటేశ్వరుడి దివ్య శక్తి తరతరాలుగా తిరుమలలో వెలుగొందుతోంది. స్వామివారి ఈ దివ్యశక్తే తిరుమలకు ప్రజాదరణను కల్పించి, లక్షలాది జన సమూహాలను శ్రీవారి ఆలయానికి రప్పిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంకితభావం కలిగిన అర్చక బృందం, పరమ భక్తిపరులైన అధికారులు మరియు దాని టిటిడి ధర్మకర్తలు కలిసి తిరుపతిని దేశంలోనే పేరెన్నిక గన్న యాత్రా స్థలంగా మార్చడానికి ఆహర్నిశలూ శ్రమిస్తుంటారు. 'ఈ లక్ష్యం కష్టసాధ్యమైందే కావచ్చు కానీ శ్రీవేంకటేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాల ప్రభావ ఫలితంగా తిరుమలకు వచ్చిన భక్తులు ఆకలి దప్పులతోనూ, దర్శనం కాకుండా తిరిగి వెళ్లర'ని టిటిడి ఛైర్మన్, చిత్తూరు ఎంపీ అయిన డి.కె ఆదికేశవులు చెప్పారు. |