కావలసిన పదార్థాలు : బియ్యంపిండి లేదా బియ్యం రవ్వ... రెండు కప్పులు బెల్లం... ఒక కప్పు పచ్చిశెనగపప్పు... రెండు టీస్పూన్లు నీరు.... ఒక కప్పు
తయారీ విధానం : తగినన్ని నీళ్లు మరిగించి అందులో బెల్లం వేసి కరిగిన తరువాత... శనగపిండి, బియ్యంపిండి లేదా రవ్వ వేసి దగ్గరపడేదాకా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కాస్తంత గట్టిపడిన తరువాత పెద్ద నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని ఉండలు చేసుకోవాలి. అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని, కమ్మనైన ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే...!
|