ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న మహిళల సంఖ్య ఈ సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే జాతీయ స్థాయి చట్టసభల్లో పురుషులతో సమానమైన వాటాను పొందడంలో మహిళ పార్లమెంటేరియన్ల సంఖ్య గణనీయమైన స్థాయిలో స్థాయిలో లేదని ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) పేర్కొంది. ప్రస్తుతం పార్లమెంట్లలో మహిళా సభ్యుల సంఖ్య 17.7 శాతానికి చేరుకుందని ఐపీయూ ప్రధాన కార్యదర్శి ఆండర్స్ జాన్సన్ శనివారం మీడియాతో అన్నారు. 2005 సంవత్సరం ముగిసేనాటికి ఈ శాతం 16.3 కాగా డిసెంబర్ 2004 నాటికి 15.7 శాతంగా నమోదైందని వెల్లడించారు. "ఇది పురోగతిగా పేర్కొనవచ్చు. కానీ మరింత లోతుగా అధ్యయనం.... |