మత సంప్రదాయాలకు బందీలై, గడప దాటకుండానే బాల్యాన్ని దుర్భరంగా వెళ్లదీస్తోన్న నేపాల్ చిన్నారి దేవతలు"కుమారీ"లకు స్వేచ్ఛ లభించింది. "సజీవ దేవతలైన కుమారీ"ల హక్కులకు భంగం కలిగించకూడదని నేపాల్ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. | | నేపాల్ దేశంలో హిందూ, బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం నాలుగేళ్ల ఆడపిల్లలను "కుమారీ"లుగా ప్రకటించి, వారిని దేవతలుగా పూజిస్తారు. బౌద్ధులు వీరిని వజ్రదేవికి ప్రతిరూపంగా భావిస్తే.. హిందువులు కాళికాదేవి అవతారంగా భావిస్తారు. ఈ కుమారీలను రాజులు కూడా పూజించేవారు. |
| |
గత మూడు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు కుమారీల హక్కులకు విఘాతం కలిగించకూడదని, వారిని పాఠశాలలకు పంపవచ్చని తీర్పునిచ్చారు. అంతేగాకుండా కుమారీల స్థితిగతులపై ఐదుగురు సభ్యుల కమిటీతో అధ్యయనం చేయించి సంవత్సరంలోపు ఓ స్పష్టమైన నివేదికను సమర్పించాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కుమారీలను కట్టుబానిసలుగా చూడవద్దని, వారి స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించకూడదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అలాగే.. మాజీ కుమారీల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
|