ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > కథనాలు > మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళపై సామూహిక అత్యాచారం: 5గురి అరెస్టు
FILE
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామును 26 ఏళ్ల మహిళను చెరపట్టి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలకూడ రైల్వే క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ పూరి గుడిసెలో ఈ మహిళ తన భర్త పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో అయిదుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను చావగొట్టారని పోలీసులు తెలిపారు.
ఎవరి అవతరణ దినోత్సవం...
  నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలుగు తల్లికి నిన్నటితో 52 ఏళ్లు నిండిన మాట నిజమే కాని పాతికేళ్ల వయసు లేని ఈ పేద మహిళ హైదరాబాద్‌లోనే ఉన్న తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా రాష్ట్రావతరణ దినం వేకువ జామునే దారుణంగా అత్యాచారానికి గురైంది.      


తర్వాత వారు ఆమె కళ్లకు గంతలు కట్టి సమీపంలో ఉన్న మరుగుకు తీసుకుపోయి సామూహికంగా ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఒక ఆటో రిక్షా డ్రైవర్‌తో సహా ఈ దారుణానికి పాల్పడిన వారంతా 25 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ఈ అయిదుగురిని ఘటన జరిగిన వెంటనే గుర్తించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

సామూహిక అత్యాచారానికి గురైన ఆ మహిళను వైద్య పరీక్షకు పంపి కేసు బుక్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.

నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలుగు తల్లికి నిన్నటితో 52 ఏళ్లు నిండిన మాట నిజమే కాని పాతికేళ్ల వయసు లేని ఈ పేద మహిళ హైదరాబాద్‌లోనే ఉన్న తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా రాష్ట్రావతరణ దినోత్సవం వేకువ జామునే దారుణంగా అత్యాచారానికి గురైంది.

మహిళలకు మన రాష్ట్రంలో స్వతంత్రత ఎప్పుడు లభిస్తుంది మరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"మెనోపాజ్" రాకను ముందే పసిగట్టవచ్చు
ఊపిరితిత్తుల్లో మహిళలు వెనుకంజే...
మేము సైతం... మద్యం మత్తులో మహిళామణులు
అబ్బాయిల్లాగా డ్రస్ వేసుకున్నారో...
మహిళలకు ప్రభుత్వం దీపావళి కానుక..!
"మహిళా జడ్జి"కీ తప్పని వరకట్న వేధింపులు