యుక్తవయస్సులో అమ్మాయిలకు మొటిమలు రావడం సహజం. అయితే, యుక్తవయసు దాటిన తర్వాత కూడా మొటిమల సమస్య వెంటాడుతున్నట్లేతే వారు లేజర్ చికిత్సను తీసుకుంటే ఫలితముంటుంది.
30 నుంచి 40 ఏళ్ళు దాటినవారు కూడా మొటిమలతో బాధపడుతున్నట్లయితే వారు కూడా ఈ చికిత్సను తీసుకోవచ్చు. ఇందులో నీలి రంగు కిరణాల వెలుతురుతో చేసే లేజర్ చికిత్స ఉత్తమమైంది. దీనిద్వారా ముఖంపై మొటిమలు వచ్చేందుకు సహకరించే బ్యాక్టీరియాలను పూర్తిగా రూపుమాపవచ్చు.
అయితే ఈ చికిత్సా సమయంలో సుమారు 30 నిమిషాలపాటు కాస్త నొప్పిగా ఉంటుంది. చికిత్సలో ఉపయోగించే కిరణాల వలన చర్మానికి ఎటువంటి హాని కలుగదు. అదనపు వివరాలకోసం లేజర్ చికిత్స అందించే కేంద్రాలను అడిగి తెలుసుకోవచ్చు.
|