కోమలమైన చర్మం కోసం రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అలాకాక ఆయుర్వేదం చెబుతున్న ఓ పద్ధతిని పాటించండి. ప్రకృతి పరంగా లభించే పదార్థాలను వాడి చూడండి.
తొలుత తులసి, గోరింట, మందారాకులతో కూడిన పొడిని నీటిలో కలిపి చర్మానికి మర్దన చేయండి. ఇది మంచి స్క్రబ్లా పనిచేసి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఆ తర్వాత పొడి చర్మం గలవారు నువ్వులు, గంధం, తవుడు నూనెలను కలిపి వాడాలి.
జిడ్డు చర్మం గలవారు పొద్దుతిరుగుడు, జొజోబానూనెలను వాడితే ఫలితం ఉంటుంది. సున్నితమైన చర్మం కలవారు జొజోబా, బాదం, గోధుమగడ్డి నూనెలను సమపాళ్లలో తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.