** చర్మ సౌందర్యానికిగాను ప్రకృతి పరంగా లభించే పండ్లు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు తీసుకుంటే చర్మకాంతి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.
** నువ్వులను పాలలో వేసి రుబ్బుకోండి. దానిని బాగా మరగబెట్టండి. ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్ళపైనున్న చర్మానికి పూస్తే చర్మంపైనున్న ధూళి కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
** నిత్యం పుదీనా రసాన్ని ముఖానికి రాస్తుంటే ముఖంపైనున్న మచ్చలు మటుమాయమవుతాయి.
** కళ్ళల్లో మంటగా ఉండి, అలసటగా ఉంటే రోజ్ వాటర్లో ముంచిన దూదిని కళ్ళపై ఉంచండి. దీంతో ఉపశమనం కలుగుతుందంటున్నారు సౌందర్యనిపుణులు.