తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్గా ఎ.ఎం. కాశీ విశ్వనాధన్ నియమిస్తూ ముఖ్యమంత్రి కరుణానిధి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర గవర్నర్ బర్నాలా సలహా మేరకు ముఖ్యమంత్రి కరుణానిధి ఈ చర్యలు చేపట్టారు.
కాశీ విశ్వనాధన్ పదవీ బాధ్యతలను ఈ నెల 29 నుంచి చేపడతారు. అంతకుముందు రోజున ప్రస్తుత ఛైర్మన్ యాషిమ్ అహ్మద్ పదవీ విరమణ చేయనున్నారు. కాశీ విశ్వనాధన్ సేలం జిల్లా చిన్నానూర్ గ్రామానికి చెందినవారు కాగా, విద్యాభ్యాసాన్ని సేలం, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు.
ఆ తర్వాత విశ్వనాధన్ తిరుచిరాపల్లి జిల్లా డెప్యూటీ కలెక్టర్గా ప్రభుత్వ సేవలను ప్రారంభించారు. 1994 లో సివిల్స్లో ఉత్తీర్ణులై ఐఎఎస్ అధికారిగా మారారు. ఆ తర్వాత మదురై జిల్లా కలెక్టర్గాను, రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్గా వ్యవహరించి గత ఏడాది ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేస్తూ ఈ పదవికి ఎదిగారు.
|