బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్ గ్లోబల్ ప్రొవైడర్ "24/7 కస్టమర్" హైదరాబాద్లోని నిజామ్ కళాశాలలో సోమవారం విద్యార్థుల కోసం బీపీఓ విజ్ఞాన సదస్సును నిర్వహించింది. భారతదేశంలోని కళాశాలలో మునుపెన్నడూ జరగని రీతిలో తొలిసారిగా బీపీఓ విజ్ఞాన సదస్సును నిర్వహించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. వివిధ క్షేత్రాలలో విద్యాభ్యాసం చేస్తున్న 200 మంది విద్యార్థులు సదస్సులో పాల్గొన్నట్లు తెలిపింది.
బీపీఓ పరిశ్రమ, పరిశ్రమలో పలు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించే దిశగా సదస్సును నిర్వహించినట్లు ప్రకటన పేర్కొంది. నిపుణులతో ఇష్టాగోష్టి సమావేశాలు జరుపడం ద్వారా బీపీఓ పరిశ్రమ పట్ల తమకుగల అపోహలు, సందేహాలను విద్యార్థులు నివృత్తి చేసుకున్నారని తెలిపింది. బీపీఓ పరిశ్రమ పట్ల విద్యార్థులలో సంపూర్ణ అవగాహన కలిగించే నిమిత్తం సదస్సును నిర్వహించారు.
|