పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరీక్షల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు బోర్డు బుధవారం ప్రకటించింది. ఫలితాలను www.telugu.webdunia.com తో సహా మరికొన్ని వెబ్సైట్లలో చూడొచ్చు.
ఇటీవల విడుదలై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను కూడా వెబ్దునియా తెలుగు ప్రచురించిన విషయం తెల్సిందే. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలువగా, పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థినులే అధిక శాతంలో ఉత్తీర్ణులు కావచ్చు. టెన్త్ ఫలితాలను బోర్డు ఉన్నతాధికారులు విడుదల చేయనున్నారు.
|