సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదల చేయనున్నారు. గత మార్చి నెలలో జరిగిన సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల్లో 7,65,095 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,49,742 మంది బాలురు ఉన్నారు. గురువారం విడుదలయ్యే ఫలితాలు సీబీఎస్ఈ.రిజల్ట్స్.నిక్.ఇన్ అనే వెబ్సైట్లు అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
చెన్నై ప్రాంతీయ ఫలితాలను బోర్డు బుధవారం విడుదల చేసిన విషయం తెల్సిందే. మిగిలిన ఐదు రీజియన్ల ఫలితాలతో సహా ఢిల్లీ ఫలితాలను గురువారం విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది. కాగా, ఢిల్లీ రీజియన్లో 2,19,796 మంది విద్యార్థులు హాజరుకాగా, పరీక్షలు 2,624 కేంద్రాల్లో జరిగాయి. ఇందులో 373 మంది వికలాంగ విద్యార్థులు ఉన్నారు.
|