నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్తో ప్రభుత్వ రంగ ఉన్నత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ కాన్పూర్ అవగాహనా ఒప్పందం చేసుకుంది. వివిధ రంగాలలో సంయుక్తంగా అధ్యయనం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటానికి ఇది దోహద పడుతుందని ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ గోవింద్ ధాండే చెప్పారు.
నేషనల్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా భారత-సింగపూర్ల మధ్య విద్యా రంగంలో అవగాహన మరింత పెరుగుతుందన్నారు. ఉన్నత విద్య కోసం భారతీయులు ఎక్కువగా సింగపూర్ వెళుతున్నారని ధాండే వివరించారు.
|