ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్ధులను చేర్చుకునే దానికి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అండర్ గ్రాడ్యుయేట్స్ (యూజీ) విభాగం వారికి తొలుత దరఖాస్తులను విశ్వవిద్యాలయం జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీ ఈ నెల 16వ తేదీ కాగా, కటాఫ్ తొలి జాబితాను ఈ నెల 26వ తేదీన జారీచేస్తారు.
విశ్వవిద్యాలయ పరిధిలోని 70 కళాశాల్లో కూడా దరఖాస్తులను విద్యార్ధులకు అందుబాటులో ఉంచారు. దరఖాస్తుల స్వీకరణ కోసం 15 కేంద్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ యూజీ కోర్సుల్లో 35వేల సీట్లు ఉన్నాయి.
|