పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థులకు వచ్చేనెల (జూన్) 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 24 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయి. ఇక టైం టేబుల్ను పరిశీలిస్తే.. జూన్ 24 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్),25 న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్),ఓ.ఎస్.ఎస్.సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), అదేవిధంగా 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ 27 న ఇంగ్లీష్ పేపర్-1, 29 న ఇంగ్లీష్ పేపర్-2, 30 న మాథ్స్ పేపర్-1,జూలై ఒకటో తేదీన మాథ్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఇకపోతే.. జూలై రెండో తేదీన జనరల్ సైన్స్-1, జూలై మూడో తేదీన జనలర్ సైన్స్-2, నాలుగో తేదీన సోషల్ స్టడీస్-1, జూలై 6న సోషల్ స్టడీస్-2, జూలై ఏడో తేదీ ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. |