జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ వృత్తి విద్యా కోర్సుల ఫలితాలను విడుదల చేసింది. జెఎన్టీయూ కాకినాడ ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, ఎంసీఏ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది.
గత జూన్ 2010లో ఎంబీఏ, ఎంసీఏ సప్లిమెంటరీ పరీక్షలను జెఎన్టీయూ నిర్వహించింది. రీకౌంటింగ్, రీవాల్యువేషన్, ఛాలెంజ్ బై రీవాల్యువేషన్లకు సెప్టెంబర్ 01,2010 చివరి తేది. దీనిపై మరింత సమాచారం సంబంధిత వెబ్సైటులో సందర్శించవచ్చు. భారత్లో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయాలలో జెఎన్టీయూ కాకినాడ కూడా ఒకటి.