ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలపై గత కొద్ది రోజులగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ విషంయలో ఎటువంటి మార్పు లేదని ఈ పరీక్షలను యధాతథంగా సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహిస్తామని ఎపిపిఎస్సీ తేల్చి చెప్పింది.
ఓ వైపు గ్రూప్ -1 పోస్టుల భర్తీలో తెలంగాణ వాటా తేల్చే వరకు పరీక్షలు నిర్వహించరాదంటూ తెలంగాణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఎపిపిఎస్సీ మాత్రం పరీక్షలు వాయిదా వేసేది లేదని తెలిపింది. కాగా.. ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి.