రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన పీసెట్-2007 ఫలితాలను పీసెట్ ఛైర్మన్ వి.బాలమోహన్దాస్ మంగళవారం విడుదల చేశారు. బీపీఈడీ కోర్సుకు 826 మంది దరఖాస్తు చేసుకోగా 618 మంది ఉత్తీర్ణులయ్యారు.
యూజీడీపీఈడీ కోర్సుకు 1047 మంది దరఖాస్తు చేసుకోగా 828 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా పీసెట్ కన్వీనర్ కిషోర్ మాట్లాడుతూ ర్యాంకు కార్డులను అభ్యర్థులకు నేరుగా పంపినట్లు తెలిపారు. ఫలితాలను సంబంధిత వెబ్సైట్ నుంచి పొందవచ్చునని వెల్లడించారు.
|