రాష్ట్రంలో టెన్త్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదారబాద్, నాంపల్లిలోని ప్రభుత్వ డైరక్టరేట్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖా మంత్రి రాజసింహా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,29,544 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,40,340 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వివరించారు. ఈ ఏడాది బాలికలు 45.11 శాతంగాను, బాలురు 40.02 శాతంగా ఉత్తీర్ణులైనట్టు చెప్పారు. ఈ ఫలితాలను విద్యార్థుల సౌలభ్యం కోసం 'తెలుగు వెబ్దునియా' అందుబాటులో ఉంచింది.
|