ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూన్, జులై నెలల్లో నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ (డీఎం, ఎంసీహెచ్), పీజీ (డిగ్రీ, డిప్లొమా), మొదటి ఏడాది బీజీఎస్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో బీడీఎస్ ఫలితాలకు సంబంధించి ఐదు గ్రేస్ మార్కులు కలిపి విడుదల చేసినట్టు యూనివర్సిటీ పేర్కొంది.
ఈ విషయమై యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఏఎన్ మూర్తి మాట్లాడుతూ పీజీ, మొదటి ఏడాది బీడీఎస్ పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, రీ టోటలింగ్ల కోసం ఆగస్ట్ 14 లోపల ప్రతి సబ్జెక్ట్కు రూ. 500 చొప్పున చెల్లించి యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అలాగే సూపర్ స్పెషాలిటీ పరీక్షల ఫలితాలను ఆయా కళాశాలల ఎగ్జామినర్లకు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందపర్చబడి ఉన్నాయని చెప్పారు.
|