గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ల రాత పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కాగా, ఈ పోస్టులకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరికి 24వ తేదీన 10.30 గంటలకు నాంపల్లిలోని ప్రతిభ భవన్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఈ ఓరల్ టెస్ట్లకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల రిజిస్టర్ నెంబర్లు 81000035, 81000059, 81000395, 81000468, 81000638, 81000696లుగా ఉన్నట్టు ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. |