| ఇంకా చదవండి |
| భవిష్యత్లో ఎదురయ్యే ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొనేందుకు రెండు వేల కోట్ల రూపాయలతో రెండో హరిత విప్లవాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. దీన్ని తూర్పు ప్రాంతంలో చేపడుతామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు. | రెండు అంకెల దేశ ఆర్థికాభివృద్ధి రేటు త్వరలోనే సాకారం కానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 2010-11 సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశంలో పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేస్తామని తెలిపారు. అప్పులను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తామన్నారు. |