అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు జెట్ ఫ్యూయల్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల్లో మరోసారి విమానయాన ఇంధన (ఎటిఎఫ్) ధరలు ఆదివారంతో 2.4 శాతం మేర పెరిగాయి. పెంచిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.
గత ఏడాది నవంబరు 26వ తారీఖున ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దాడులకు పాల్పడి 50 మంది మరణానికి వందమందికి పైగా తీవ్రగాయాలు పాలవడానికి కారణమైన కసబ్ మరో విషయాన్ని బయటపెట్టాడు. డబ్బుకోసం తన తండ్రి తనను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అమ్ముకున్నాడని వెల్లడించాడు.
సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు, ఆయన అనుచరులు చెంచల్గూడా జైలులో ప్రత్యేక సౌకర్యాలు పొంది జైలు జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు అయితే ఈ బృందానికి తాజాగా మరో కోరిక కలిగింది. ల్యాప్టాప్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు.