స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు పుంజుకుని 13,238 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు బలపడి 3,977 వద్ద కొనసాగుతోంది.
బీహెచ్ఈఎల్, సిప్లా, డీఎల్ఎఫ్, గ్రాసిం ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, జైప్రకాశ్ అసోసియేట్స్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తుండగా... ఏసీసీ, అంబుజా సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, హిందుస్థాన్ యునిలివర్, హిండాల్కో, ఐటీసీ, మారుతీ, ఎన్టీపీసీ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|