స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్లు పుంజుకుని 13,779 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 39 పాయింట్లు బలపడి 4,131 వద్ద కొనసాగుతోంది.
విప్రో, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యంక్, టాటా స్టీల్, హిందుస్థాన్ యునిలివర్, ఎల్అండ్టీ తదితర సంస్థల వాటాలా లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే జైప్రకాశ్ అసోసియేట్స్, డీఎల్ఎఫ్, హిండాల్కో తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|