స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 131 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 14,625 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 4,333 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.90 శాతం, నిఫ్టీ 0.98 శాతం మేరకు వృద్ధి చెందాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,483 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,038 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,356 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. డీఎల్ఎఫ్, ఎస్బీఐ, భారతి, స్టెరిలైట్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి. |