స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,617 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 4,636 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.56 శాతం మేరకు క్షీణించాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,779 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,709 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 992 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. మారుతీ అత్యధికంగా లాభాల్లో ఉంది. టాటా మోటార్స్, హీరో హోండా తదితర సంస్థల వాటాలు కూడా లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, భెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.