స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 134 పాయింట్లు కోల్పోయి 15,532 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 4,619 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.86 శాతం, నిఫ్టీ 0.93 శాతం మేరకు క్షీణించాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,830 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా1,119 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,645 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఎంఅండ్ఎం, ఏసీసీ, స్టెరిలైట్, డీఎల్ఎఫ్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.