ముంబై స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ ఆరంభమైనది మొదలుకుని ఉదయం 11 గంటల వరకు నష్టాలను చవిసూచిన మార్కెట్ మధ్యాహ్నానికి పైబడి వృద్ధి బాట పట్టింది. ఫలితంగా సెన్సెక్స్ 31 పాయింట్లు లాభపడి, 15927 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగుతోంది.
అలాగే నిఫ్టీ సైతం ఏడు పాయింట్లు లాభపడి 4718 వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో నాస్డాక్ 52 పాయింట్లను కోల్పోయింది. ముకుంద్, ఏటీఎన్ ఇంటర్నేషనల్, సూర్య ఫార్మ్, ప్రికాల్, ఓవీటీ న్యాచురల్, ఫోనిక్స్ ల్యాంప్ తదితర కంపెనీలు లాభాల బాట పట్టాయి.