స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్లు కోల్పోయి 15,638 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 4,636 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.72 శాతం, నిఫ్టీ 1.60 శాతం మేరకు క్షీణించాయి.
కేవలం ఒకే గంటలో మార్కెట్లు భారీగా నష్టాలను చవిచూశాయి. ఏసీసీ అత్యధికంగా నష్టాలను చవిచూస్తోంది. దాని తర్వాతి స్థానాల్లో ఐటీసీ, రిలయన్స్, మారుతీ, ఎల్అండ్టీ, హిందుస్థాన్ యునిలివర్ తదితర సంస్థల వాటాలు ఉన్నాయి. హిండాల్కో, ఆర్కామ్, భారతీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.