ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » తగ్గిన నష్టాలు: రికవరీ దిశగా స్టాక్ మార్కెట్ (Stock Market | recovery | Sensex | Index | BSE | NSE | trade)
నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ రికవరీ దిశగా పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 15,843 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 4,704 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.43 శాతం, నిఫ్టీ 0.14 శాతం మేరకు క్షీణించాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,620 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,339 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,182 కంపెనీల వాటాలు నష్టపోయాయి. ఉదయం నష్టాలను సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు రికవరీ చేసింది. భారతీ, ఆర్కామ్, హిండాల్కో తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. ఎల్అండ్టీ, ఐటీసీ, డీఎల్ఎఫ్, ఏసీసీ, ఇన్ఫోసిస్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.