స్టాక్ మార్కెట్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 16,136 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 4,779 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.45 శాతం, నిఫ్టీ 0.28 శాతం మేరకు లాభపడ్డాయి.
జేపీ అసోసియేట్స్ అత్యధిక లాభాల్లో పయనిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో డీఎల్ఎఫ్, ఎస్బీఐ, టాటా స్టీల్, స్టెరిలైట్, రిలయన్స్ ఇన్ఫ్రా, హెచ్డీఎఫ్సీ తదితర సంస్థల వాటాలు ఉన్నాయి. అలాగే హిందుస్థాన్ యునిలివర్, టాటా పవర్, భెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. మొత్తం 2,515 వాటాలు ట్రేడ్ అవగా, 1,931 వాటాలు లాభపడ్డాయి. అలాగే 528 వాటాలు నష్టపోయాయి.