వారాంతం లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం కూడా లాభాలను నమోదు చేసుకుంది. దేశీయ వాటాల అమ్మకాలు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 99 పాయింట్లు లాభపడి, 17వేల మార్కు కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని 5,067 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
ఇకపోతే గుజరాత్ ఆటో, ఆర్టీ ఎక్స్పోర్ట్స్ వంటి కంపెనీలు లాభాలను నమోదు చేసుకోగా, ఎన్స్టీల్ వంటి కంపెనీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.