దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమారంగ సంస్థ ఎల్ఐసీ తిలక్నగర్ ఇండస్ట్రీస్ షేర్లను 19 కోట్లరూపాయలకు విక్రయించింది. ఇందులో మొత్తం 190287 ఆల్కహాలిక్ బెవరేజెస్ షేర్లను మొత్తం 19.12 కోట్ల రూపాయలకు విక్రయించింది.
ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్చేంజ్కు సమర్పించిన లేఖలో పేర్కొంది. ఎల్ఐసీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఫలితంగా తిలక్నగర్ ఇండస్ట్రీస్ ఒక్కో షేర్ ధర రూ.110.60 చొప్పున ముగిసింది. బుధవారంతో పోల్చితే ఈ ధర 4.33 శాతం మేరకు పడిపోయింది.