బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఆశాజనకంగా కొనసాగుతున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 12 పాయింట్లు పుంజుకుని, 18,414 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా కేవలం 9 పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెంది, 5,540 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
యూరప్ మార్కెట్ లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. అలాగే పీఎస్యూ, ఆటో, హెల్త్కేర్, కన్జూమర్ డూరబుల్స్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ లాభాల వైపు కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.