దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిరాశాజనకంగా కొనసాగడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పతనమయ్యాయి. ఇందులో సెన్సెక్స్ నష్టాలతో 18,200 మార్కు దిగువ స్థాయికి పడిపోగా, నిఫ్టీ 5,500 దిగువ మార్కు వద్ద కొనసాగుతోంది.
ఐటీ, టెక్, ఎఫ్ఎమ్సీజీ, పవర్, బ్యాంకింగ్, వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం స్టాక్ మార్కెట్కు కలిసిరాలేదు. మెటల్, పీఎస్యూ, ఆయిల్, గ్యాస్, కన్జూమర్ డూరబుల్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకున్నప్పటికీ స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగలేకపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.