బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ ఆరంభం నుంచే హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగిస్తున్న సెన్సెక్స్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కేవలం రెండు పాయింట్ల నష్టంతో 18,235 పాయింట్ల మార్కును తాకింది. అయితే నిఫ్టీ మాత్రం ఆరు పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,492 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
రియాల్టీ, కన్జూమర్ డూరబుల్స్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇంకా ద్రవ్యోల్బణం రెండెకల స్థాయికి చేరుకోవడం బాంబే స్టాక్ మార్కెట్కు కలిసిరాలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.