ఊపందుకున్న ట్రేడింగ్: భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంటోంది. దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 307 పాయింట్లు భారీగా లాభపడి, 18,528 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 88 పాయింట్లు బలపడి, 5,567 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
మెటల్, రియాల్టీ, ఐటీ, టెక్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగడం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమైంది. ఇంకా విదేశీ మార్కెట్లు సైతం లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.