ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
 
షరతులకు అంగీకరించకుంటే.. పాక్‌తో ఒప్పందం
గ్యాస్ పైపు‌లైను ప్రాజెక్టులో తమ షరతులకు భారత్ అంగీకరించని పక్షంలో పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ మార్గంలో సరఫరా కోసం చేపట్టే పైప్‌లైన్ నిర్మాణ వ్యయాన్ని భరించే విషయంలో ఆ దేశంతో భారత్ ఓ అంగీకారానికిరాని పక్షంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు కోసం పాకిస్థాన్‌తో మాత్రమే ఒప్పందం కుదుర్చుకోగలమని హెచ్చరించింది.

దీనికి సంబంధించి ఆ రెండు దేశాలు చర్చలు జరుపుతుండగా, భారత్ ప్రతినిధులు మాత్రం వాటికి దూరంగా ఉన్న నేపధ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. మూడు దేశాల మధ్య ఈ ఒప్పందం జరగాలని తాము కోరుకుంటుండగా, అది జరగని పక్షంలో పాకిస్థాన్‌తో మాత్రమే ఒప్పందం చేసుకోగలమని చెప్పారు. ఇరాన్‌-పాకిస్తాన్-భారత్‌ల మీదుగా.. గ్యాస్ పైపు లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే.
మరిన్ని
ఐఎంఎఫ్‌సి అధ్యక్ష రేసులో విత్తమంత్రి..!
ఆరంజ్ కంట్రీ కొత్త రిసార్ట్స్‌ ప్రారంభం
ట్రేడ్‌మార్క్‌పై పోరాటంలో `అమూల్` విజయం
న్యూయార్క్‌లో భారత్ ప్రైవేట్ రంగ ప్రతినిధుల సమావేశం
ఆర్‌ఎస్‌జీబీఎల్ వీరంగం కేంద్ర ఉత్పత్తి వృద్ధి
ఐవీఆర్‌సీఎల్‌కు రూ. 394.24 కోట్ల ఆర్డర్‌