ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విజయవాడలో సన్ ఎఫ్ఎమ్ స్టేషన్ ప్రారంభం
ప్రముఖ పుణ్యస్థలమైన తిరుపతిలో ప్రారంభమైన సన్ ఎఫ్.ఎం రేడియో ఇప్పటి తెలుగు శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.ఈ ఎఫ్.ఎం తాజాగా విజయవాడలో రేడియో స్టేషన్‌ను ప్రారంభించింది. ఎస్ ఎఫ్ఎమ్‌ పేరుతో 93.5 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద విజయవాడ శ్రోతలకు ఇది అందుబాటులో ఉంటుందని కళ్ రేడియో లిమిటెడ్ పేర్కొంది. దీంతో సన్ ఎఫ్.ఎం నెట్‌వర్క్‌ జాబితాలో 17వ ఎఫ్ఎమ్ స్టేషన్ చేరింది.

సన్‌కు ఇప్పటికే చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, విశాఖపట్నం, బెంగుళూరు, హైదరాబాద్, జైపూర్, భువనేశ్వర్, తిరుపతి, మదురై, ట్యుటికోరిన్, లక్నో, భోపాల్, పాండిచ్చేరి, కాలికట్, ఇండోర్‌ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఎమ్ స్టేషన్లు ఉన్నాయి. దేశంలో మొత్తం 45 ఎఫ్ఎమ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు సన్‌కు లైసెన్సు ఉంది. మిగిలిన 28 స్టేషన్లను కూడా ప్రారంభిస్తే దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎమ్ నెట్‌వర్క్‌గా సన్ గ్రూపు అవతరించనుంది.
మరిన్ని
న్యూఢిల్లీ-న్యూయార్క్‌ల మధ్య నాన్‌‌స్టాప్ సర్వీసులు
డీజల్‌పై ఢిల్లీ ప్రభుత్వం సెస్ వసూలు
కేరళలో ఔట్‌లెట్‌ను ప్రారంభించిన టైమెక్స్
అదిదాస్ బ్రాండ్ అంబాసిడార్‌గా సానియా
ఆపిల్ కొత్త ఐపాడ్స్ ఆవిష్కరణ త్వరలో
మార్చిలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రారంభం