ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యాడ్స్ ధరలను పెంచనున్న సన్‌టీవీ
యాడ్స్ ధరలను త్వరలో పెంచనున్నట్ల ప్రముఖ టీవీ ఛానెళ్ సన్‌టీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రకటించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారాలను నిర్వహిస్తున్న సన్ నెట్‌వర్క్ సంస్థ సోమవారం ఈ మేరకు ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది.

ముంబాయిలో సోమవారం విలేకరుల సమావేశంలో సన్‌టీవీ నెట్‌వర్క్ సంస్థ అధినేత కళానిధి మారన్ మాట్లాడుతూ తాము పెంచనున్న అడ్వర్టైజ్‌మెంట్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. అలాగే కంటెంట్ ప్రొడ్యూసర్స్ వద్ద ఫిబ్రవరి 15 నుంచి వసూళ్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ధరల వివరాలను తెలుపుతూ తమిళ ఛానెళ్ అడ్వర్టైజ్‌మెంట్ ధరలు 10 నుంచి 21 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే తెలుగు ఛానెళ్ (జెమినీ టీవీ)కు 15 శాతం, కన్నడ ఛానెళ్ (ఉదయ టీవీ)కు 10 నుంచి 20 శాతం వరకు, మలయాళం ఛానెళ్ (సూర్య టీవీ)కు 3 నుంచి 13 శాతం వరకు పెంచనున్నట్లు చెప్పారు.
మరిన్ని
ఫిక్కీ కొత్త అధ్యక్షునిగా రాజీవ్ చంద్రశేఖర్
బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలి: విత్తమంత్రి
గల్ఫ్‌కు జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులు ప్రారంభం
గ్యాస్ పైపులైను ప్రాజెక్టుపై ఇరాన్-పాక్ సమీక్ష
పెట్రో వడ్డనకు సిద్ధమవుతున్న కేంద్రం
భెల్‌లో బీహెచ్‌పీవీ విలీనం: ప్రధాని