ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) తన చమురు ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలోని హైడ్రోకార్బన్ రంగంలో అతిపెద్దదైన వెలికితీత మరియు ఉత్పాదక కంపెనీగా ఓఐఎల్ గణతికెక్కింది. జాతీయ ముడి చమురు మొత్తం ఉత్పాదనలో 10 శాతాన్ని మరియు జాతీయ సహజ వాయు మొత్తం ఉత్పాదనలో ఏడు శాతాన్ని ఓఐఎల్ ఉత్పత్తి చేస్తుంది.
ఏడాది పొడవునా జరిగే ఓఐఎల్ కంపెనీ స్వర్ణోత్సవాలలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ నుంచి కంపెనీ మాజీ ఛైర్మన్లు, మాజీ మేనేజింగ్ డైరక్టర్లు పాల్గొంటున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థగానే మాత్రమే కాక అస్సామ్ ఎగువ ప్రాంత ప్రజల జీవనంలో ఓఐఎల్ మమేకమైపోయింది. స్వతంత్ర భారతావనికే తొలి చమురు ఉత్పాదక బావిగా వాసికెక్కిన నహర్కటియాలోని ఓఐఎల్ బావిని గగోయ్ సోమవారం ఉదయం సందర్శించారు. "జాతి వారసత్వ క్షేత్రం"గా గగోయ్ బావిని జాతికి అంకితం చేశారు.
|