ఏప్రిల్ నెలలో స్వదేశీ సరకు వాహన విక్రయాలు 21.21శాతం మేర పెరిగాయని భారత వాహన ఉత్పత్తిదారుల సంఘం (సియామ్ ) తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 107263 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు ఈ ఏడాది 130013 యూనిట్లకు చేరుకుందని వెల్లడించింది.
అలాగే స్వదేశీ కారు విక్రయాలు గత ఏడాది ఏప్రిల్లో 84283గా ఉండగా, ఈ ఏడాది 17.2శాతం వృద్ధితో 98740 యానిట్లకు చేరుకుందని తెలిపింది. బహుళ ప్రయోజక వాహనాలు సైతం 48.25శాతం వృద్ధితో 9070కు చేరుకుందని తెలిపింది.
|