మార్కెట్లలో ప్రతి ప్రయోజనాన్ని సొమ్ము చేసుకోవాలంటే భారత పరిశ్రమల రంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆ రంగ మేధావులు సూచించారు. సోమవారం డిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. కార్పొరేట్ పాలసీలలో మార్పులు తీసుకు రావాలని కోరారు.
అట్లాంటకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెసర్ జగధీష్ సేత్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు మార్కెట్ను నడుపుతున్నాయన్నారు. 21 శతాబ్ధంలో అభివృద్ధి చెందుతున్న దేశాల వంతు వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితులలో భారత్ సంస్కరణలు చేపట్టాలని కోరారు.
పబ్లిక్ సెక్టార్ల ప్రైవేటీకరణ, నాణ్యతకు ప్రోత్సాహకాలు కల్పన, ఉత్పత్తిలో పరివర్తన ఇవన్నీ ప్రపంచ పోటీలో భారత్ తట్టుకునేలా చేస్తుందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వ్యాపారాలు లాభిస్తాయని చెప్పారు.
|