చెన్నైకి చెందిన ప్రముఖ కంటి ఆస్పత్రి శంకర్ నేత్రాలయ మారిషస్లోని సవులియాక్ అనే ప్రాంతంలో కొత్త కేంద్రం ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఈ ఆస్పత్రి యాజమాన్యం, మారిషస్ ప్రభుత్వం సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం ఆస్పత్రి భవన నిర్మాణం, తదితర మౌళిక సదుపాయాలను మారిషస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ఆస్పత్రిలో సేవలు, మందులు తదితరాలను ఆస్పత్రి వర్గాలు ఏర్పాటు చేసుకుంటాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది ఈ కేంద్రం సేవలను ప్రారంభించనుందని ఆస్పతి వర్గాలు వెల్లడించాయి.
|