విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా త్వరలో ఛార్జీలను తగ్గించనుంది. విమాన ఇంధన సర్ ఛార్జీని 10 నుండి 12 శాతం మేరకు తగ్గించాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
ఇంధనంపై సర్ ఛార్జీ తగ్గించడం ద్వారా ప్రయాణ ఛార్జీలు భారీగా తగ్గనున్నట్లు ఎయిర్ ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
ముందుగా డిసెంబర్ నెలలో సర్ ఛార్జీని దేశీయ మార్గాల్లోనూ, ఆ తర్వాత జనవరి మాసంలో అంతర్జాతీయ మార్గాల్లో సర్ ఛార్జీని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. |