ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > 97 లక్షల డాలర్ల షేర్లు విక్రయించిన సిటీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
97 లక్షల డాలర్ల షేర్లు విక్రయించిన సిటీ
ప్రస్తుతం ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సిటీ గ్రూప్‌కు చెందిన అధికారులు రెండు రోజులలో దాదాపు 97 లక్షల డాలర్ల విలువ కలిగిన షేర్లను విక్రయించారు.

సిటీ గ్రూపుకు చెందిన డైరెక్టర్లలోని ప్రముఖుడు సర్ విన్ బిస్చౌఫ్‌తోబాటు మరో ఐదుమంది అధికారులు గత రెండు రోజులలో 77 లక్షల షేర్లను అమ్మేశారు. వీటి విలువ దాదాపు 97 లక్షల డాలర్లుంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.

ఇంత పెద్ద మొత్తంలో తమ షేర్లను మార్చి నెల 2, 3వ తేదీలలో అమ్మినట్లు సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ కంపెనీ తెలిపింది. విక్రమ్ పండిట్‌కు చెందిన సిటీ గ్రూప్ షేర్లు గతవారంలో ఒకడాలరుకన్నా తక్కువకు దిగజారాయి. న్యూయార్క్‌లోని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మార్చినెల ఆరవ తేదీకి కంపెనీ షేరు ధర 1.03 డాలరుకు చేరుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
21వ శతాబ్దం భారత్‌దే: ముఖేష్ అంబానీ
టైటాన్ మరో 40 దుకాణాలను ప్రారంభిస్తుంది
అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఈ వారంలో సత్యం కంప్యూటర్స్ విక్రయం
కార్పొరేట్ పారదర్శకత జాబితాలో సిటీ, పెప్సికో