ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > భారత్- పాక్ వాణిజ్యంలో భారీ క్షీణత: ఫిక్కీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్- పాక్ వాణిజ్యంలో భారీ క్షీణత: ఫిక్కీ
పాకిస్థాన్‌లో హింసాత్మక పరిస్థితుల కారణంగా దేశీయ వ్యాపారులకు ఆ దేశంపై ఆసక్తి బాగా క్షీణిస్తోందని ఫిక్కీ నిర్వహించిన సర్వేలో తేలింది. రాబోయే నెలల్లో పాకిస్థాన్- భారత్ మధ్య వాణిజ్యం బాగా దెబ్బతింటుందని ఫిక్కీ పేర్కొంది. 2009-10లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 శాతం మేర క్షీణించి, 900 మిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని ఫిక్కీ సర్వే నివేదిక అంచనా వేసింది.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ రెండు బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అయితే భారత ఎగుమతిదారులు పాక్ వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాకిస్థాన్‌తో వ్యాపారం సాగిస్తున్న ఎగుమతిదారులు, దిగుమతిదారులు వద్ద ఫిక్కీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాక్‌లో హింసాత్మక పరిస్థితులను చూసి భారత వ్యాపారులు భీతిల్లుతున్నారని ఫిక్కీ వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సత్యం షేర్ల ధరల్లో పెరుగుదల
97 లక్షల డాలర్ల షేర్లు విక్రయించిన సిటీ
21వ శతాబ్దం భారత్‌దే: ముఖేష్ అంబానీ
టైటాన్ మరో 40 దుకాణాలను ప్రారంభిస్తుంది
అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు