ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > కోల్‌కతా-లండన్ ఏఐ సర్వీసులు పునరుద్ధరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోల్‌కతా-లండన్ ఏఐ సర్వీసులు పునరుద్ధరణ
కోల్‌కతా-లండన్ మధ్య విమాన సర్వీసును పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసు నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థ ఒక విమాన సర్వీసును నడుపుతూ వచ్చింది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం, ఈ మార్గంలో పెద్దగా లాభాలు లేకపోవడం వల్ల ఆ సంస్థ సర్వీసును నిలిపివేస్తున్నట్టు శనివారం ప్రకటించింది.

ఆ మరుక్షణంపై ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. గత 2008 సంవత్సరం నుంచి ఈ మార్గంలో విమాన సర్వీసును ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇకపై నుంచి కోల్‌కతా-లండన్‌కు ఢిల్లీ మీదుగా వారంలో అన్ని రోజుల్లో విమాన సేవలను అందిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

కోల్‌కతాలోని ఎన్.ఎస్.సి బోస్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఉదయం 10.30 నిమిషాలకు ఎయిర్ బస్-319 122 మంది ప్రయాణికులతో బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుకుంటుంది. ఢిల్లీ నుంచి బోయింగ్ 777-200 ఈకే విమానం 280 ప్రయాణికులతో లండన్‌కు చేరుకుంటుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. అయితే, బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం కోల్‌కతా నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతూ వచ్చింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ద్విచక్రవాహనాలపై ప్రభావం చూపనున్న నానో
ఏటీఎమ్ నెట్‌వర్క్ కోసం కొత్త కంపెనీ: ఐసీఐసీఐ
బంగ్లాదేశ్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన బ్రిటీష్
ప్రైమ్‌లెండింగ్ రేట్‌ను తగ్గించిన బ్యాంకులు
పారిశ్రామికవేత్తలతో మన్మోహన్ సమావేశం
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు