వడ్డీ రేట్లు తగ్గించే ప్రతిపాదనలు పరిశీలించేందుకు బ్యాంకులు అంగీకరించాయని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో ప్రణబ్ ముఖర్జీ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక ప్రదర్శనను మెరుగుపరిచేందుకు వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రణబ్ ముఖర్జీ బ్యాంకులకు సూచించారు.
బ్యాంకులను ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రణబ్, పరిశ్రమ వర్గాలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించాలని సూచించారు. వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గించకుండా అన్నిరంగాలు అభివృద్ధి బాటలో నిలవడం సాధ్యం కాదని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. |